బోపన్నకు 20వ ఏటీపీ టైటిల్‌

బోపన్నకు 20వ ఏటీపీ టైటిల్‌
  • కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది 20వ ఏటీపీ టైటిల్‌‌‌‌ కైవసం
  • రామ్‌‌‌‌కుమార్‌‌‌‌తో కలిసి అడిలైడ్‌‌‌‌ టోర్నీలో గెలుపు

మెల్‌‌‌‌బోర్న్: ఇండియా టెన్నిస్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ స్టార్‌‌‌‌ రోహన్‌‌‌‌ బోపన్న కెరీర్‌‌‌‌లో 20వ ఏటీపీ డబుల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ సొంతం చేసుకున్నాడు. రామ్‌‌‌‌కుమార్‌‌‌‌ రామనాథన్‌‌‌‌తో తొలిసారి జోడీ కట్టిన బోపన్న ఏటీపీ అడిలైడ్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న–రామ్‌‌‌‌కుమార్‌‌‌‌ జోడీ 7–6 (6), 6–1తో టాప్‌‌‌‌ సీడ్స్‌‌‌‌ ఇవాన్‌‌‌‌ డోడింగ్‌‌‌‌–మార్సెలో మెలో జంటపై గెలిచింది. రామ్‌‌‌‌కుమార్‌‌‌‌కు ఇది తొలి ఏటీపీ టైటిల్‌‌‌‌. గంటా 21 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో ఇండియన్స్‌‌‌‌ సూపర్‌‌‌‌గా ఆడారు. 

రామ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ చేయగా... బోపన్న  తన ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను చూపెట్టాడు. కీలక సమయాల్లో అద్భుతమైన సర్వీస్‌‌‌‌ రిటర్న్స్‌‌‌‌తో పాయింట్లు రాబట్టాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ సెట్‌‌‌‌ థ్రిల్లింగ్‌‌‌‌గా సాగింది. 5–6తో నిలిచిన టైమ్‌‌‌‌లో బోపన్న 12వ గేమ్‌‌‌‌ గెలిచి సెట్‌‌‌‌ను టై బ్రేక్‌‌‌‌కు తీసుకెళ్లాడు. అక్కడ మెలో సర్వీస్‌‌‌‌లో రిటర్న్‌‌‌‌ విన్నర్‌‌‌‌ కొట్టిన రోహన్​.. సూపర్‌‌‌‌ సర్వ్‌‌‌‌తో సెట్‌‌‌‌ గెలిచాడు. సెకండ్‌‌‌‌ సెట్‌‌‌‌ను ఈజీగా గెలిచిన ఇండియా జోడీ టైటిల్‌‌‌‌ సొంతం చేసుకుంది.