ససారం: దేశం వేగంగా ఆర్థిక ప్రగతి సాధిస్తున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆయన పేర్కొన్నారు. బీహార్లోని రోహ్తాస్ జిల్లాలో శనివారం ఓ ప్రైవేట్ యూనివర్సిటి కాన్వొకేషన్లో ఆయన మాట్లాడారు.
"2027 నాటికి మనం మొదటి మూడు స్థానాల్లోకి వస్తామని గ్లోబల్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ నమ్ముతున్నారు. 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏండ్లు పూర్తవుతుంది. అప్పటివరకు అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని మనం ఇప్పుడు సంకల్పించుకోవాలి" అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.