
న్యూఢిల్లీ: ఇండియా టీటీ డబుల్స్ జోడీ మనిక బత్రా–సత్యన్.. డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో సెమీస్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో మనిక–సత్యన్ 3–0 (11–8, 11–3, 11–8)తో సెడ్రిక్ మిస్నెర్–యువాన్ వాన్ (జర్మనీ)పై గెలిచింది. 21 నిమిషాల పోరులో ఇండియన్ జంట పూర్తి ఆధిపత్యం చూపెట్టింది. మెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో హర్మీత్ దేశాయ్ 0–3 (5–11, 6–11, 5–11)తో లియాంగ్ యానింగ్ (చైనా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్లో ఐహికా ముఖర్జీ 0–3 (5–11, 9–11, 10–12)తో మియు నాగసాకి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది.