
లిమెరిక్ (ఐర్లాండ్): వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్లో ఇండియా అండర్–18 కాంపౌండ్ టీమ్ గోల్డ్ మెడల్తో మెరిసింది. గురువారం జరిగిన కాంపౌండ్ ఫైనల్లో ఐశ్వర్య శర్మ–అదితి సవామి–ఏక్తా రాణితో కూడిన ఇండియా త్రయం 214–212తో అమెరికాను ఓడించింది. ఈ టోర్నీలో ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్ కావడం విశేషం. కాంపౌండ్ క్యాడెట్ బాయ్స్ విభాగంలో ఇండియా సిల్వర్తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఇండియా, మెక్సికో చేతిలో ఓడింది.