భారత్ -అమెరికా మధ్య కీలక ఒప్పందాలివే..

భారత్ -అమెరికా మధ్య కీలక ఒప్పందాలివే..

భారత్ అమెరికా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరు దేశాల మధ్య కీలక చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ మాట్లాడారు.  ఈ సందర్భంగా భారత్, అమెరికా మధ్య మూడు ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు మోడీ. భారత్‌- అమెరికా మైత్రి బంధానికి ప్రభుత్వాలతో సంబంధంలేదు. ప్రజల కేంద్రంగానే రెండు దేశాల బంధం బలోపేతమవుతుందన్నారు. రక్షణ, భద్రత, టెక్నలజీ అంశాల్లో కలిసి సాగాలని నిర్ణయించుకున్నామన్నారు.

భారత సైన్యం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో అమెరికాతో సంయుక్త విన్యాసాలు చేపడుతుందన్నారు మోడీ.  రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరబోతున్నాయన్నారు.  దేశ భద్రతకు అమెరికా, భారత్‌ మైత్రీ బంధం ఎంతో ఉపయోగకమన్నారు. మానవ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌ అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించామన్నారు. ట్రంప్‌ పాలసీతో ట్రేడ్‌ పాలసీ బలోపేతం అవుతుందన్నారు.

భారత పర్యటన ఎన్నటికీ మరిచిపోలేను: ట్రంప్

భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైందన్నారు ట్రంప్. రెండు దేశాల మధ్య మంచి చర్చలు జరిగాయన్నారు. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామన్నారు.  5జీ వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌పై చర్చించామన్నారు. 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయన్నారు.  ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలపై ప్రధానంగా చర్చించామన్నారు. పరస్పర ప్రయోజనాలను కాపాడుకునేలా పారదర్శకంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు.