అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి
హైదరాబాద్, వెలుగు: ఇండియా, అమెరికా మధ్య వ్యాపారం విపరీతంగా పెరుగుతోందని ఇండియాలో అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి అన్నారు. ఇందుకు రెండు దేశాలు తీసుకున్న చొరవ కారణమని అన్నారు. టీ–హబ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇండియా ఎకానమీ అద్భుతంగా ఎదుగుతోంది. హైదరాబాద్ సాధించిన ప్రగతి ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు మన దేశాల మధ్య వ్యాపారం దాదాపు సున్నాగా ఉండేది.
అమెరికా గత ఏడాది ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇరు దేశాల బిజినెస్ విలువ 191 బిలియన్ డాలర్లు దాటింది. మా దేశంలో రెండు లక్షల మంది భారతీయ స్టూడెంట్లు చదువుతున్నారు. త్వరలో జరగబోయే మోడీ–బైడెన్ భేటీలో వాణిజ్యంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. టీ–హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్. ఐడియాలను ఇది బిజినెస్లుగా మార్చుతోంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తోంది”అని ఆయన వివరించారు.