నాగ్ పూర్ వన్డే : కోహ్లీ 50వ హాఫ్ సెంచరీ

నాగ్ పూర్ వన్డే : కోహ్లీ 50వ హాఫ్ సెంచరీ

నాగ్ పూర్ :ఐదే వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న సెకండ్ వన్డేలో భారత్ నిలకడగా ఆడుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ధావన్, రాయుడు తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు.

తర్వాత వచ్చిన విజయ్ శంకర్(20) –కోహ్లీ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే కెప్లెన్ విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీ చేశాడు. ఇది కోహ్లీకి వన్డేలో 50వ హాఫ్ సెంచరీ. శంకర్, కోహ్లీ పార్ట్నర్ షిప్ 150 రన్స్ వరకు ఉంటే భారత్ గుడ్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. 25 ఓవర్లకు భారత్ స్కోర్ 124/3. విరాట్(50,) శంకర్(27) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

ఆస్రేలియా బౌలర్లలో..ప్యాట్ కమిన్స్, మ్యాక్స్ వెల్, లిన్ తలో వికెట్ తీశారు.