హైదరాబాద్సిటీ, వెలుగు: ఉస్మాన్ సాగర్ కాండ్యూట్ను ఆధునీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉస్మాన్సార్ నుంచి ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్ మధ్య దాదాపు 11 కి.మీ ఉన్న ఈ కాండ్యూట్ ద్వారా రోజు 27 ఎంజీడీల రా వాటర్సరఫరా చేస్తున్నారు. నిజాం హయాంలో నిర్మించిన ఈ కాండ్యూట్ శిథిలావస్థకు చేరుకోవడంతో తరచూ లీకేజీలతో నీటి వృథా జరుగుతోంది.
దీంతో కాండ్యూట్ ఆధునికీకరించాలని వాటర్బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శుక్రవారం జీవో.777 జారీ చేసింది. ఈ పనుల కోసం గతంలోనే రూ.282 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరైంది. టెండర్ల పరిశీలన తర్వాత ఎల్-1 బిడ్డర్గా ఎంపికైన సుధాకర ఇన్ఫ్రాటెక్ కు 4.89 శాతం అధిక ధరతో రూ.208.33 కోట్ల విలువైన కాంట్రాక్టును ప్రభుత్వం ఆమోదించింది.
