నేడు బంగ్లాతో ఇండియా వామప్ మ్యాచ్

నేడు బంగ్లాతో ఇండియా వామప్ మ్యాచ్

కార్డిఫ్‌ : వరల్డ్​కప్​ ముందు ఇండియా ఆఖరి సన్నాహకానికి రెడీ అయిం ది. తొలి వామప్‌ లో చెత్తగా ఆడి న్యూజిలాండ్​ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీ సేన బంగ్లాదేశ్‌ తో మంగళవారం అఖరి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుం ది. గత మ్యాచ్‌ లో స్వింగ్‌‌, బౌలర్లకు అనుకూలించిన పిచ్‌ పై తేలిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌ లో స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాలని చూస్తోం ది. అయితే, ఐపీఎల్‌ లో గాయపడిన కేదార్‌జాదవ్‌ పై స్పష్టత లేకపోగా ప్రాక్టీస్‌ సెషన్‌ లో విజయ్ శంకర్‌ గాయపడడం మరింత ఆందోళన రెకేత్తిస్తోం ది. ఈ మ్యాచ్‌ లో వీరిద్దరూ బరిలోకి దిగడం అనుమానమే. ఇక న్యూజిలాండ్‌ పై విఫలమైన బ్యాట్స్​మన్​ ఈ మ్యాచ్​ను సద్వి నియోగం చేసుకోవాలని చూస్తున్నారు .

బంగ్లాపై మంచి రికార్డు ఉన్న రోహిత్‌శర్మ, శిఖర్‌ ధవన్‌ బ్యాట్‌ ఝుళిపిం చాలని కోరుకుం-టున్నారు . కీలకమైన నాలుగో స్థానంలో లోకేశ్‌ రాహుల్‌ కు మరో అవకాశం దక్కనుం ది. బంగ్లాపై రాణిస్తే ప్రస్తుతానికి నాలుగో నంబర్‌ అతని వశమైనట్లే. అయితే ప్రయోగాత్మకంగా దినేశ్‌ కార్తీక్‌ ను ఈ స్థానంలో ఆడించే చాన్స్‌‌ ఉంది. మిడిలార్డర్‌ లో హార్దిక్‌ ఫర్వా లేదనిపించగా, గత మ్యాచ్‌ లో మాజీ కెప్టెన్‌ ధోనీ అసౌకర్యంగా కన్పించాడు. ఈ నేపథ్యంలో ఈమ్యాచ్‌ లో సత్తాచాటి లీగ్‌ ‌మ్యాచ్‌లకు ముందు ఆత్మవిశ్వా సం కూడగట్టుకోవాలని టీమ్‌ మేనేజ్‌‌మెంట్‌ కోరుకుంటోం ది. కుల్దీప్‌ కూడా ఫామ్‌ లోకి రావాలని చూస్తున్నాడు.