
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాకీ జట్టు సెమీస్కు మరింత చేరువైంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఇండియా 5–0తో మలేసియాను చిత్తు చేసింది. ఇండియా తరఫున సెల్వమ్ కార్తీ (15వ ని.), సింగ్ హార్దిక్ (32వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (42వ ని.), గుర్జాంత్ సింగ్ (53వ ని.), జుగురాజ్ సింగ్ (54వ ని.) గోల్స్ చేశారు. జపాన్తో జరిగిన మ్యాచ్లో పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మల్చడంలో ఫెయిలైన ఇండియా ఫార్వర్డ్స్ ఇందులో సూపర్ సక్సెస్ అయ్యారు.
పెనాల్టీల ద్వారానే మూడు గోల్స్ సాధించారు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే మంచి సమన్వయంతో కదిలిన ఇండియా ప్లేయర్లు షార్ట్ పాస్లతో ఆకట్టుకున్నారు. దీంతో 15వ నిమిషంలో హర్మన్ప్రీత్ ఇచ్చిన పాస్ను లోకల్ ప్లేయర్ కార్తీ ఫీల్డ్ గోల్ కొట్టాడు. రెండో క్వార్టర్లో స్కోరును సమం చేసేందుకు మలేసియా చేసిన ప్రయత్నాలను ఇండియా డిఫెన్స్ అడ్డుకుంది. మూడో క్వార్టర్లో లభించిన తొలి పెనాల్టీనే హార్దిక్ గోల్గా కొట్టి స్కోరును 2–0కు పెంచాడు.
ఇక ఒత్తిడిలో పడిన మలేసియన్లు ఎదురుదాడి చేసినా ఫలితం లేకపోయింది. ఫీల్డ్ సెటప్లో కొద్దిగా మార్పులు చేసిన కెప్టెన్ హర్మన్ రెండో పెనాల్టీని గోల్గా మలిచాడు. చివరి క్వార్టర్లో రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు అవకాశాలను గుర్జాంత్, జుగ్రాజ్ గోల్స్గా మల్చడంతో ఇండియా భారీ ఆధిక్యంతో విజయాన్ని అందుకుంది. ఓవరాల్గా ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలు, ఓ డ్రాతో టీమిండియా 7 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది.
రెండు మ్యాచ్లు డ్రా
జపాన్తో జరిగిన మ్యాచ్ను పాకిస్తాన్ 3–3తో డ్రా చేసుకుంది. దీంతో ఇరుజట్లు సెమీస్ రేస్లోనే కొనసాగుతున్నాయి. పాక్ తరఫున రాణా అబ్దుల్ (9వ ని.), ఖాన్ మహ్మద్ (25, 55వ ని.) గోల్స్ చేయగా, టనకా సెరెన్ (13వ ని.), కాటో రోయెసి (37వ ని.), ఒహాషి మసాకి (45వ ని.) జపాన్కు గోల్స్ అందించారు. చైనా, కొరియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా 1–1తో డ్రాగా ముగిసింది. చైనా ప్లేయర్ చెన్ చెంగ్కాంగ్ (43వ ని.) గోల్ సాధించగా, జాన్ జోంగ్హుయాన్ (18వ ని.) కొరియాకు ఏకైక గోల్ అందించాడు.