- పదో వికెట్ పడగొట్టలేకపోయిన టీమిండియా
- రచిన్, అజాజ్ డిఫెన్స్
- బ్యాడ్లైట్తో గెలుపు దూరం
- డ్రాతో న్యూజిలాండ్ ఎస్కేప్
జడేజా (4/40), అశ్విన్ (3/35) సూపర్గా బౌలింగ్ చేస్తున్నారు. ఫస్ట్ సెషన్లో వికెట్ రాకపోయినా.. లాస్ట్ రెండు సెషన్లలో ఎనిమిది మందిని ఔట్ చేశారు. ఇంకో వికెట్ పడగొడితే మనదే విక్టరీ. జడేజా జోరు చూస్తే ఇండియా గెలవడం పక్కా అనిపించింది. కానీ, చివరకు డ్రాతో సరిపెట్టుకుంది.
దానికి కారణం ఇద్దరు ఇండియన్సే!! ముంబైలో పుట్టిన అజాజ్ పటేల్ (23 బాల్స్లో 2 నాటౌట్), కన్నడ ఫ్యామిలీకి చెందిన రచిన్ రవీంద్ర (91 బాల్స్లో 18 నాటౌట్) ఫుల్ టెన్షన్లో.. క్లోజ్ ఫీల్డింగ్లో... వరల్డ్ క్లాస్ స్పిన్నర్ల బౌలింగ్లో 8.4 ఓవర్లు వికెట్ కాపాడుకొని న్యూజిలాండ్కు ఓటమి తప్పించారు..! బ్యాడ్లైట్ కారణంగా 12 నిమిషాల ముందే మ్యాచ్ ముగియడంతో టీమిండియా విక్టరీ కొంచెంలో మిస్సవగా..కివీస్ డ్రాతో ఎస్కేప్ అయింది..! రిజల్ట్ రాకపోయినా ఐదు రోజుల పాటు సాగిన మ్యాచ్ ఫ్యాన్స్కు మస్తు మజా ఇచ్చింది. కాన్పూర్లో స్పోర్టివ్ పిచ్ ప్రిపేర్ చేసిన గ్రాండ్ స్టాఫ్ కు ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ రూ. 35 వేల క్యాష్ ప్రైజ్ ఇచ్చాడు.
కాన్పూర్: న్యూజిలాండ్తో ఫస్ట్ టెస్టులో ఇండియా కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది. లాస్ట్ డే అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్లింగ్గా సాగిన మ్యాచ్ను డ్రాతో సరిపెట్టింది. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ (1/23) టీమ్ను గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలకు న్యూజిలాండ్ టెయిలెండర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ చివర్లో బ్రేక్వేశారు. 284 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో ఓవర్నైట్ స్కోరు 4/1తో ఐదోరోజు, సోమవారం సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్.. డెడ్ డిఫెన్స్ బ్యాటింగ్తో 98 ఓవర్లలో 165/9 స్కోరు చేసి మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఓపెనర్ టామ్ లాథమ్ (146 బాల్స్లో 3 ఫోర్లతో 52), సోమర్విల్లే (110 బాల్స్లో 5 ఫోర్లతో 36), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (112 బాల్స్లో 3 ఫోర్లతో 24)తో పాటు ఎనిమిదో నంబర్లో వచ్చిన 22 ఏళ్ల రచిన్ రవీంద్ర.. చివరి ముగ్గురు బ్యాటర్లతో 28 ఓవర్ల పాటు వికెట్ కాపాడుకొని హీరోగా నిలిచాడు. తన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ కొట్టిన ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. సిరీస్లో రెండో, చివరి టెస్టు ముంబైలో శుక్రవారం స్టార్ట్ అవుతుంది.
డెడ్ డిఫెన్స్.. లాస్ట్లో డ్రామా
టార్గెట్ 284. గెలవాంటే లాస్ట్ డే ఇంకో 280 రన్స్ చేయాలి. ఈ సిచ్యుయేషన్లో కివీస్ డ్రా కోసమే ట్రై చేసింది. ఓవర్నైట్ బ్యాటర్లు లాథమ్, సోమర్విల్లే ఇద్దరూ డిఫెన్స్ ఆడారు. సోమర్విల్లే అప్పుడప్పుడు ఫోర్లు కొట్టినా.. లాథమ్ మాత్రం డెడ్ డిఫెన్స్తో బౌలర్లను ఫ్రస్ట్రేట్ చేశాడు. మార్నింగ్ పేసర్ల తర్వాత స్పిన్నర్లు వచ్చినా రిజల్ట్ రాలేదు. దాంతో, ఫస్ట్ సెషన్ను కివీస్ 79/1 స్కోరుతో ఫినిష్ చేసింది. అయితే, లంచ్ తర్వాత ఫస్ట్ బాల్కే సోమర్విల్లేను ఔట్ చేసిన ఉమేశ్ (1/34).. సెకండ్ వికెట్కు 76 రన్స్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత లాథమ్కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తోడయ్యాడు. ఈ సెషన్లో ఇద్దరూ మరింత అల్ట్రా డిఫెన్స్ బ్యాటింగ్ చూపెట్టారు. అయితే, ఫిఫ్టీ దాటిన తర్వాత లాథమ్ను అశ్విన్ బౌల్డ్ చేయగా.. సెషన్ చివర్లో రాస్ టేలర్ (2)ను జడేజా ఎల్బీ చేయడంతో ఇండియా రేసులోకి వచ్చింది. 125/4తో కివీస్ టీకి వెళ్లగా.. లాస్ట్ సెషన్లో ఇండియాకు మరో ఆరు వికెట్లు అవసరం అయ్యాయి. బ్రేక్ తర్వాత కెప్టెన్ రహానె రెండు ఎండ్ల నుంచి ముగ్గురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాడు. సెకండ్ ఓవర్లోనే హెన్రీ నికోల్ (1)ను ఎల్బీ చేసిన అక్షర్ హోమ్టీమ్లో జోష్ నింపాడు. కొద్దిసేపటికే జడేజా ఓ లో లెంగ్త్ బాల్తో కెప్టెన్ విలియమ్సన్ను ఎల్బీగా వెనక్కిపంపడంతో కివీస్పై ప్రెజర్ పెరిగింది. ఈ టైమ్లో రచిన్ రవీంద్రతో బ్లండెల్ (38 బాల్స్లో 2) పది ఓవర్లపాటు క్రీజులో నిలిచాడు. చివరకు అశ్విన్ బౌలింగ్లో బ్లండెల్ బౌల్డ్ అయ్యాడు. అయినా వెనక్కుతగ్గని రచిన్.. జెమీసన్ (30 బాల్స్లో 5)తో కలిసి ముందుకెళ్లాడు. ఇంకోవైపు లైట్ తగ్గిపోతుండటంతో ఆటలో టెన్షన్ మొదలైంది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సపోర్ట్ లేదు. బాల్ పెద్దగా టర్న్ అవలేదు. కొంచెం లో బౌన్స్ మాత్రమే వచ్చింది. దాన్నే యూజ్ చేసుకున్న జడేజా.. ఐదు ఓవర్ల గ్యాప్లో జెమీసన్, టిమ్ సౌథీ (4)ను ఔట్ చేసి ఆశలు రేపాడు. మరో పది ఓవర్లు పడే చాన్స్ ఉండటంతో ఇండియా కచ్చితంగా గెలుస్తుందని అనిపించింది. ఈదశలో గ్రౌండ్లో హైడ్రామా నడిచింది. చాలా టైమ్ నుంచి క్రీజులో ఉన్న రచిన్, లాస్ట్ బ్యాటర్గా వచ్చిన అజాజ్.. ఇండియా స్పిన్నర్లకు అడ్డుగా నిలిచారు. ఫుల్ టెన్షన్లో 52 బాల్స్ ఫేస్ చేశారు. మరోవైపు సాయంత్రం కావడంతో వెలుతురు కూడా క్రమంగా తగ్గింది. అప్పటికే రెండుమూడు సార్లు అంపైర్లు లైట్ చెక్ చేశారు. షెడ్యూల్ ప్రకారం 4.34 వరకు ఆడాల్సి ఉన్నా.. లైట్ పూర్తిగా తగ్గడంతో 4.22కే అంపైర్లు ఆట ముగించారు. దాంతో, మ్యాచ్ డ్రా అయింది.
షార్ట్ స్కోర్స్
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్: 345 ఆలౌట్; న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 296 ఆలౌట్;
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్: 234/7 డిక్లేర్డ్; న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ (టార్గెట్ 284): 165/9 (లాథమ్ 52, సోమర్విల్లే 36, జడేజా 4/40, అశ్విన్ 3/35).