India vs Pakistan : మాజీ క్రికెట్ దిగ్గజాలు తలపడే వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 షెడ్యూల్ ఈరోజు (సెప్టెంబర్ 12, శనివారం) అధికారికంగా విడుదలైంది. షార్జా, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ టోర్నమెంట్లో సాంప్రదాయ ప్రత్యర్థులైన భారత్ ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఫిక్స్ అయ్యింది. ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
అక్టోబర్ 10న మహా సంగ్రామం:
ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురి చేసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. 2025 ఎడిషన్లో చోటు చేసుకున్న బాయ్కాట్ డ్రామా (బహిష్కరణ వివాదం) తర్వాత ఇరు జట్లు ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి కావడంతో ఈ మ్యాచ్పై భారీ హైప్ నెలకొంది.
అక్టోబర్ 3 నుంచి లెజెండ్స్ రచ్చ:
అక్టోబర్ 3న షార్జా వేదికగా ప్రారంభమయ్యే ఈ టోర్నీ తొలి రోజున టీమిండియా ఛాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ వర్సెస్ బంగ్లాదేశ్ ఛాంపియన్స్ మ్యాచ్లతో సమరం షురూ కానుంది. అక్టోబర్ 3 నుంచి 14వ తేదీ వరకు రోజుకు రెండు మ్యాచ్ల చొప్పున ఫ్యాన్స్కు నాన్స్టాప్ వినోదం దక్కనుంది.
మాజీ దిగ్గజాల నాస్టాల్జియా:
ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ డబ్ల్యూసీఎల్ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు చెందిన మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు బరిలోకి దిగుతారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ను ఏలిన తమ అభిమాన మాజీ ఆటగాళ్లను మళ్లీ మైదానంలో చూడటంతో అభిమానులు పాత జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్నారు.
🚨 WCL 2026 SCHEDULE 🏆
— Johns. (@CricCrazyJohns) September 12, 2026
- Biggest names of Cricket will be in action, the much awaited India vs Pakistan clash on October 10th 🔥
Great news for Cricket fans in UAE. pic.twitter.com/Li0WyuPzp2
