వెస్టిండీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా ఫ్లాప్ షో కొనసాగుతోంది. మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ ల్లో(2, 25) కలిపి 27 పరుగులే చేసిన పుజారా.. రెండో టెస్ట్లోనూ నిరాశ పరిచాడు.ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ (13) కూడా ఫెయిలయినా.. కొహ్లీ 76, మయాంక్ అగర్వాల్ (55) హాఫ్ సెంచరీతో సత్తాచాటారు దాంతో, శుక్రవారం మొదలైన రెండో టెస్ట్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా మొదటి రోజు ఆట ముగిసే సమయ 90 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. హనుమ విహరీ 42,రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మెరిసిన కొహ్లీ, మయాంక్
గత మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల మా దిరిగా ఈసారి కూడా ఇండియా టాపార్డర్ తడబడింది. వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ లోనే లోకేశ్ రాహుల్ను పెవిలియన్ చేర్చాడు. టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాను తన మూడో ఓవర్ లో జంబో స్పి న్నర్ కార్న్వాల్ ఔట్ చేసి ఇండియాకు షాకిచ్చాడు. కార్న్వాల్ వేసిన బాల్ను కట్ చేయబోయిన పుజారా పాయింట్ లో బ్రూక్స్ కు చిక్కాడు. 46 రన్స్కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును మయాంక్ 55 , కోహ్లీ 76 రన్స్ తో ఆదుకున్నారు. వెస్టిండిస్ బౌలర్లలో హోల్డర్ కు మూడు వికెట్లు, రాంకీమ్ కార్న్ వాల్ ,రోచ్ లకు చెరో వికెట్ పడ్డాయి

