
హైదరాబాద్, వెలుగు: మానవ మనుగడకు నీళ్లు ఎంతో ముఖ్యమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ ముఖేశ్ కుమార్ సిన్హా అన్నారు. భవిష్యత్ తరాల నీటి అవసరాలకు ఇప్పటి నుంచే వాటర్ మేనేజ్మెంట్ అవసరమని తెలిపారు.
‘‘ఇండియా వాటర్ వీక్ 2024’’ 8వ నేషనల్ సెమినార్ సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ఢిల్లీలో జరగనున్నాయి. ఈ సెమినార్కు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ శుక్రవారం సికింద్రాబాద్లోని సీజీవో టవర్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేశ్ కుమార్ మాట్లాడారు. ‘‘కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమినార్ నిర్వహిస్తున్నరు. వివిధ దేశాల నుంచి దాదాపు 5 వేల మంది ప్రతినిధులు అటెండ్ అవుతరు’’ అని తెలిపారు.