2036లో ఒలింపిక్స్ కు ఇండియా రెడీ : మోదీ

2036లో ఒలింపిక్స్ కు ఇండియా రెడీ :  మోదీ

2036లో ఒలింపిక్స్ గేమ్స్ ను నిర్వహించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశ స్పోర్ట్స్ బడ్జెట్ ను ఇప్పటికే మూడు రెట్లు పెంచామన్నారు. గురువారం గోవాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ నేషనల్ గేమ్స్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల మనదేశం అంతర్జాతీయంగా క్రీడల్లో అద్భుతమైన సత్తా చాటుతోందని, ఇది యువ క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నదని తెలిపారు. క్రీడాకారులకు ఆర్థికపరంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు తాము ప్రత్యేక పథకాలు తెచ్చామని, దేశంలో ట్యాలెంట్ ఉన్న క్రీడాకారులకు కొదవలేదని అన్నారు. మన చాంపియన్లను ఒలింపిక్ పోడియం దగ్గరకు తీసుకెళ్లేలా కేంద్రం ఒక రోడ్ మ్యాప్ సృష్టించిందని, దాని ప్రభావం ఇప్పుడు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.