ఎగుమతులను భారీగా పెంచుతాం: కేంద్రమంత్రి పీయుష్ గోయల్

ఎగుమతులను భారీగా పెంచుతాం: కేంద్రమంత్రి పీయుష్ గోయల్

బెర్న్: ప్రపంచ వాణిజ్యం తీవ్రమైన భౌగోళిక,-రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, మనదేశ వస్తువులు, సేవల ఎగుమతుల విలువ 2025–-26 ఆర్థిక సంవత్సరంలో 825 బిలియన్ డాలర్లను దాటుతుందని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రష్యా–-ఉక్రెయిన్ సంఘర్షణ, ఇజ్రాయెల్-–హమాస్ యుద్ధం, ఎర్రసముద్రం సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ, దేశం  మొత్తం ఎగుమతులు 2023-–24లో 778 బిలియన్ డాలర్ల నుంచి 825 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ హైకి చేరుకున్నాయి. ఈసారి 825 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఎగుమతులు సాధిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

"ప్రపంచం తీవ్రమైన భౌగోళిక, -రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. భారతదేశం ఎల్లప్పుడూ ఇలాంటి సమయాల్లో విజేతగా నిలిచింది. మేం 2024–-25లో రికార్డు స్థాయిలో 825 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించాం. ఈ సంవత్సరం ఇవి మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం" అని ఆయన తెలిపారు. ఎగుమతిదారుల సంఘం ఎఫ్​ఐఈఓ అంచనా ప్రకారం, దేశ మొత్తం వస్తువులు,  సేవల ఎగుమతులు 2025-–26లో సంవత్సరానికి 21 శాతం పైగా పెరిగి ట్రిలియన్ డాలర్లకు చేరుతాయి.  ఈ సంస్థ లెక్కల ప్రకారం, 2025-–26లో సరుకు ఎగుమతులు 12 శాతం పెరిగి 2024-–25లో 437 బిలియన్ డాలర్ల నుంచి 525-–535 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి. సేవల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 20 శాతం సంవత్సరానికి పెరిగి 465–-475 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి.

ఈ రంగాల్లో ఎక్కువ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, కెమికల్స్, టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్  దుస్తులు, ఫార్మా,  వ్యవసాయ రంగాల నుంచి ఎగుమతులు భారీ పెరుగుతాయని భావిస్తున్నారు. యూఏఈ , ఆస్ట్రేలియా,  యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్​టీఏ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రాబోయే నెలల్లో ఎగుమతులను పెంచడానికి కూడా సహాయపడతాయి. ఇండియా-ఈఎఫ్​టీఏ వాణిజ్య ఒప్పందం ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మోదీ  ప్రభుత్వం ఆస్ట్రేలియా, యూకే, ఈఎఫ్​టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్, పెరూ  చిలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఎఫ్​టీఏలను కుదుర్చుకుంటున్నదని మంత్రి పీయుష్​ గోయల్​ అన్నారు.