వీరనారీలు : ఇండియాదే టీ 20 సిరీస్

వీరనారీలు : ఇండియాదే టీ 20 సిరీస్

మిర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎదుర్కోవడంలో విఫలమైన ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు ఆఖరి టీ20 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తడబడ్డారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (40), జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (28) మినహా మిగతా వారు ఫెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా 2–1కే పరిమితమైంది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఇండియా 20 ఓవర్లలో 102/9 స్కోరు మాత్రమే చేసింది. యాస్తిక భాటియా (12), షెఫాలీ వర్మ (11) ఫర్వాలేదనిపించినా తర్వాతి ఐదుగురు సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే పరిమితం కావడంతో ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉంచలేకపోయా రు.

బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3, సుల్తానా ఖాతున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 18.2 ఓవర్లలో103/6 స్కోరు చేసి గెలిచింది. షమీమా సుల్తానా (42), నిగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుల్తానా (14), సుల్తానా ఖాతున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (12) రాణించారు. మిన్ను మణి, దేవికా వైద్య చెరో రెండు వికె ట్లు తీశారు. షమీమా సుల్తానాకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, హర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డులు లభించాయి. ఆదివారం నుంచి ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరగనుంది.