
- 31 యూట్యూబ్ వీడియో లింక్స్, 32 వెబ్సైట్లు కూడా
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న దృష్ట్యా ఆ దేశ అధికారులు 16 భారతీయ యూట్యూబ్ న్యూస్ చానల్స్, 31 యూట్యూబ్ వీడియో లింక్స్, 32 వెబ్సైట్లను బ్లాక్ చేశారు. తప్పుడు సమాచారం, పాకిస్తాన్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ వాటిని బ్లాక్ చేసినట్టు పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
డిజిటల్ ప్లాట్ఫామ్ల బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ) ఈ చర్య తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఏ చానల్స్బ్లాక్చేసింది స్పష్టంగా వెల్లడించలేదు. జాతీయ భద్రతను కాపాడటానికి, పాకిస్తాన్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.
పాకిస్తాన్లోని టెలికాం వినియోగదారుల కోసం సురక్షితమైన, విశ్వసనీయమైన ఇంటర్నెట్ వాతావరణాన్ని కల్పించడానికి పీటీఏ కట్టుబడి ఉందని, ఆన్లైన్ కంటెంట్ను చురుగ్గా పర్యవేక్షిస్తూనే ఉంటుందని పేర్కొంది. దేశ జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలిగించే ఏ విషయంపైనైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.