
కశ్మీర్ లో టెన్షన్ కొనసాగుతోంది. హంద్వారాలోని బాబాగుండ్ లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదుల కదలికలతో మూడు రోజులుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడే చనిపోయినట్లు నటించి ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో పౌరుడు చనిపోయాడు. దీంతో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి బలగాలు.
ఎల్వోసీలో పాకిస్తాన్ కవ్వింపులు ఆపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పూంచ్, రాజౌరీ సెక్టార్ లో కొత్తగా 400 బంకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూంచ్ సెక్టార్ లో రెండు వందలు, రాజౌరీ సెక్టార్ లో మరో రెండు వందల బంకర్లను నెల రోజుల్లో నిర్మించనున్నారు.