
NIBE Stock: ఆపరేషన్ సిందూర్ ఇండియాకు రెండు లాభాలను తెచ్చిపెట్టింది. ఒకపక్క శత్రుదేశంలో దాగిఉన్న ఉగ్రమూఖలను తుదిముట్టించగా.. మరోపక్క భారత ఆయుధ సంపత్తి పనితీరు ఎంత ఖచ్చితంగా ఉందనే విషయాన్ని యుద్ధ భూమిలో ప్రపంచ దేశాలు పరిశీలించాయి. కేవలం విదేశాల నుంచి కొన్న ఆయుధాలపై ఆధారపడకుండా వాటికి ఇండియన్ టెక్నాలజీస్ యాడ్ చేయటం పెద్ద పట్టును అందించిందని దీనిని చూసినవారు అంటున్నారు.
దీంతో తాజాగా ఇజ్రాయెల్ కంపెనీ నుంచి భారత రక్షణ సంస్థ నైబ్ లిమిటెడ్ తాజాగా యూనివర్సల్ రాకెట్ లాంచర్ల సరఫరాకు ఆర్డర్ అందుకుంది. ఈ ఆర్డర్ విలువ రూ.150 కోట్లుగా వెల్లడైంది. గడచిన కొన్ని వారాలుగా దేశీయ డిఫెన్స్ స్టాక్ పై ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతున్న సమయంలో తాజా డీల్ రావటంతో నైబ్ కంపెనీ షేర్ల ధర ఏకంగా ఇంట్రాడేలో 5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ఈ స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్ ధర ప్రస్తుతం ఒక్కోటి రూ.వెయ్యి 602 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే స్టాక్ 52వారాల గరిష్ఠ ధర రూ.2వేల 245గా ఉన్న సంగతి తెలిసిందే.
పూణే కేంద్రంగా పనిచేస్తున్న నైబీ సంస్థ దాదాపు 300 కిలోమీటర్ల పరిధి కలిగిన రాకెట్ లాంచర్లను తయారు చేయటం మంచి గుర్తింపును కలిగి ఉంది. కంపెనీ ఈ ఆర్డర్ 2027 నవంబర్ నాటికి డెలివరీ అందించాల్సి ఉంటుంది. అయితే కంపెనీ ఇజ్రెయెల్ సంస్థ వివరాలను మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. కంపెనీ పొందిన ఆర్డర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపుతో పాటు వ్యాపార విస్తరణకు దోహదపడుతుందని తెలుస్తోంది. నైబీ సంస్థ దేశంలో మొదటిసారిగా ప్రపంచ మార్కెట్ కోసం హైటెక్ యూనివర్సల్ రాకెట్ లాంచర్ను తయారు చేస్తున్నట్లు కూడా పేర్కొంది.
నైబీ స్టాక్ గడచిన 5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 16వేల శాతం రాబడిని తెచ్చిపెట్టింది. వాస్తవానికి జూన్ 2020లో స్టాక్ ధర ఒక్కోటి కేవలం రూ.9.93వద్ద ఉన్న సంగతి తెలిసిందే. కానీ నేడు ఇది రూ.16వందలకు చేరుకుంది. అలాగే గడచిన నెలరోజుల్లో కూడా స్టాక్ 18 శాతం పెరుగుదలను చూసింది. ప్రస్తుతం డిఫెన్స్ స్టాక్స్ బూమ్ కొనసాగుతున్న వేళ ఇన్వెస్టర్లు ఈ రంగంలోని అనేక లిస్టెడ్ కంపెనీ షేర్లపై తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు.