
HNI Trouble: దేశంలో ఆదాయాలకు సంబంధించి నిర్వహించిన సర్వే పైలో సంపన్న భారతీయులకు సంబంధించి ఆసక్తికర విషయాలు కనుగొన్నారు. హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ తమ ఆర్థిక లక్ష్యాలను అందిపుచ్చుకోవటంలో విఫలమౌతున్నట్లు తేలింది. వారు పన్ను తర్వాతి ఆదాయంలో కనీసం 20 శాతం కంటే తక్కువ డబ్బు దాచుకోగలుగుతున్న వారి సంఖ్య 43 శాతంగా ఉన్నట్లు తేలింది.
తాజాగా డన్ & బ్రాడ్స్ట్రీట్తో కలిసి మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ నిర్వహించిన ఇండియా వెల్త్ సర్వే 2025 సంపన్న భారతీయుల వాస్తవ ఆర్థిక అంతరాల పరిస్థితులను వెలుగులోకి తీసుకొచ్చింది. వీరు ఏడాదికి రూ.20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ సగం మందికి చెల్లించాల్సిన రుణాలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రతి 10 మందిలో నలుగురు పిల్లల చదువులు, రిటైర్మెంట్, సొంత ఇంటి కల వంటి లక్ష్యాలను చేరుకోవటానికి ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 29 శాతం మంది తమకు డబ్బు దాచుకునే క్రమశిక్షణ లేదని చప్పగా.. 21 శాతం మందికి సరైన పెట్టుబడి మార్గాలు తెలియవని తేలింది.
ఇక పోతో 40 శాతం మంది తమ పెట్టుబడులపై తక్కువ రాబడులను పొందుతున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఆర్థిక భద్రత లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమౌతున్నట్లు వెల్లడైంది. దాదాపు 14 శాతం మంది ఎమర్జెన్సీ ఫండ్ కూడా కలిగి లేరని తేలింది. మెుత్తం మీద సగం మందికి మాత్రమే గ్లోబల్ లేదా మల్టీ అసెట్ ఇన్వెస్ట్మెంట్లపై అవగాహన కలిగి ఉన్నారని సర్వేలో వెల్లడైంది.
చాలా మంది హెచ్ఎన్ఐలు తమ పెట్టుబడిలో రియల్ ఎస్టేట్ ఆస్తులు ఎక్కువగా కలిగి ఉన్నట్లు తేలింది. 87 శాతం మంది అడ్వైజర్లపైనే ఆధారపడి తమ పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ సర్వేతో పెరుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు మెరుగైన ఆర్థిక అక్షరాస్యత, అనేక పెట్టుబడుల్లోకి డబ్బు డైవర్సిఫికేషన్, ఉచిత అడ్వైజరీ సేవల ప్రాముఖ్యత అవసరమని హైలైట్ చేస్తోంది. మెుత్తానికి సంపన్నులు తమ భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవటంలో వెనుకబడి ఉన్నట్లు సర్వే కుండబద్ధలు కొట్టింది.