
న్యూఢిల్లీ: భారతదేశ హాస్పిటాలిటీ (హోటల్స్) ఇండస్ట్రీ 2025 జనవరి-మార్చి క్వార్టర్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఇండస్ట్రీ 2028 నాటికి బిలియన్ డాలర్ల (రూ.8,600 కోట్ల) ఇన్వెస్ట్మెంట్స్ను ఆకర్షించే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ జేఎల్ఎల్ శుక్రవారం ఒక రిపోర్ట్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి–-మార్చిలో రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్ (రెవ్పర్) గత ఏడాది ఇదే పీరియడ్తో పోలిస్తే 16.3శాతం పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ 2024లో కూడా ఇండియా వ్యాప్తంగా రెవ్పర్ 8 శాతం సీక్వెన్షియల్ గ్రోత్ చూపించింది. ఈ ఏడాది జనవరి–మార్చిలో 79 కొత్త హోటల్స్ నిర్మాణానికి సంతకాలు జరిగాయి. హైదరాబాద్లో హోటల్స్కు రూమ్లపై వచ్చే సగటు ఆదాయం ఏడాది లెక్కన 15.1 శాతం పెరిగింది.