
హైదరాబాద్, వెలుగు: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2025 ను ప్రైడ్ ఇండియా అవార్డ్స్ అందించింది. విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంస్కృతి వంటి విభాగాల్లోని వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు.
హైదరాబాద్లో జరిగిన ఈ ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి దక్షిణాది నటి కావ్యా థాపర్, నారీ పురస్కార్ గ్రహీత కె. రాధాదేవి, జియోలాజిస్ట్, సేక్రెడ్ ట్రస్ట్ ఫౌండర్ వాసుదేవ్ వీ.ఎన్. అతిథులుగా హాజరై అవార్డులను అందజేశారు.
ప్రైడ్ ఇండియా అవార్డ్స్ వ్యవస్థాపకులు వినాయకుమార్ నారాయణ స్వామి మాట్లాడుతూ, “ వెలుగులోకి రాని గొప్ప వ్యక్తులను గౌరవించాలన్నది మా లక్ష్యం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గొప్ప నాయకత్వాన్ని గుర్తించే వేదికగా ఎదిగింది”అని
అన్నారు.