చెన్నై: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) మరో చరిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. తన తొలి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) మిషన్కు అన్ని ఏర్పాట్లను ఇస్రో పూర్తి చేసింది. ఆదివారం శ్రీహరికోటలోని స్పేస్ పోర్ట్ నుంచి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్.. ఎర్త్అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్) 2 శాటిలైట్తో పాటు స్టూడెంట్లు రూపొందించిన ఆజాదీశాట్ను నింగిలోకి మోసుకుపోనుంది. ఈ ప్రయోగం 13 నిమిషాల్లోనే పూర్తవుతుంది.
ఎస్ఎస్ఎల్వీలో ఇదే తొలి మిషన్
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)లతో ఎన్నో విజయవంతమైన మిషన్లను పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు తన తొలి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగానికి రెడీ అయ్యింది. ఎస్ఎస్ఎల్వీల ద్వారా శాటిలైట్లను భూమి లోయర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడుతుంది. గత కొద్ది వారాలుగా శాస్త్రవేత్తలు స్మాల్ లాంచ్ వెహికల్స్ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిన్న శాటిలైట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ఇస్రో అడుగులు వేస్తోంది. ఈ శాటిలైట్ల బరువు 500 కేజీల వరకు ఉంటుంది. వీటిని 500 కిలోమీటర్ల దూరంలోని లోయర్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. ఎస్ఎస్ఎల్వీ ప్రయోగానికి 5 గంటల కౌంట్డౌన్ మాత్రమే ఉంటుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఆదివారం ఉదయం 4.18 గంటలకు కౌంట్డౌన్ మొదలవుతుంది. 9.18 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచ్ప్యాడ్ నుంచి ఎస్ఎస్ఎల్వీ నింగిలోకి వెళుతుంది.