టొరంటో: కెనడాలో దాడికి గురైన మన దేశ స్టూడెంట్ గుర్విందర్ నాథ్ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. టొరంటోలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ సిద్ధార్థనాథ్ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. గుర్విందర్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
అసలేం జరిగిందంటే..
కెనడాలోని బిజినెస్ స్కూల్ స్టూడెంట్ అయిన గుర్విందర్ నాథ్(24) పార్ట్ టైమ్గా పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో మిస్సిసాగాలోని క్రెడిట్ వ్యూ రోడ్లో డెలివరీకి వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అడ్డుకుని బైక్ దొంగిలించేందుకు యత్నించారు. నాథ్పై తీవ్రంగా దాడి చేశారు. అతడు కుప్పకూలడంతో బైక్తీసుకుని పరారయ్యారు.
అటుగా వెళ్తున్న స్థానికులు గుర్విందర్నాథ్ను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న నాథ్ ఈ నెల 24న మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. క్రెడిట్ వ్యూ రోడ్ పెద్దగా జనాలు ఉండే ఏరియా కాదని, బైక్ చోరీ కోసమే దుండగులు పిజ్జా ఆర్డర్ చేసుంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.