ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్-ఎల్) పోటీలు

ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్-ఎల్) పోటీలు

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్-ఎల్) పోటీల్లో భాగంగా రాష్ట్రంలోని ఫీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ టౌన్లు కేంద్ర అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా.. మున్సిపల్ ​అండ్​ అర్బన్​డెవలప్మెంట్​ కమిషనర్ సత్యనారాయణకు మంగళవారం సమాచారం అందించారు. తాజాగా వచ్చిన అవార్డులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రానికి19 అవార్డులు దక్కాయి. ఈ నెల 17న ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీని నిర్వహించారు. పోటీల్లో దేశంలోని 1850 పట్టణాలు పాల్గొన్నాయి. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ .. 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరిలో కోరుట్ల పట్టణం ఎంపికయ్యింది. ఈ మూడు పట్టణాలకు ఈ నెల 30న ఢిల్లీలో టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు.