
డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో యూపీఐ సునామీ సృష్టిస్తోంది. రోజురోజుకూ ప్రజాధరణ పెరగటంతో ఈ టెక్నాలజీ ద్వారా జరుగుతున్న ట్రాన్సాక్షన్లు సైతం భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ విస్తరణ ప్రపంచ దిగ్గజ కార్డ్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలకు అస్సలు మింగుడుపడటం లేదు.
వాస్తవానికి వీసా, మాస్టర్కార్డ్ సంస్థలు పేమెంట్ చెల్లింపుల సెటిల్మెంట్ ఆలస్యంగా జరుగుతాయి. కానీ భారతదేశంలో వినియోగిస్తున్న యూపీఐ చెల్లింపు వ్యవస్థ రియల్ టైమ్ సెటిల్మెంట్లను అందిస్తోంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సెటిల్మెంట్ వ్యవస్థగా యూపీఐ గుర్తింపును తెచ్చుకుంది. కేవలం జూన్ 1, 2025న యూపీఐ ద్వారా 6.44 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. జూన్ 2న 6.5 కోట్ల చెల్లింపులు జరిగాయి. మే నెలలో సగటున రోజుకు యూపీఐ చెల్లింపులు 6.02 కోట్లుగా ఉన్నాయి.
అమెరికాకు చెందిన వీసా సంస్థ సగటున రోజుకు 6.74 కోట్ల ట్రాన్సాక్షన్స్ ప్రాసెసింగ్ చేస్తోంది. అయితే కంపెనీ రోజుకు ఎన్ని పేమెంట్ సెటిల్మెంట్స్ చేస్తుందనేదానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మాస్టర్ కార్డ్ రోజుకు సగటున 4.5 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సంస్థలు ఎక్కువగా క్రెడిట్ పేమెంట్స్ కోసం వినియోగించబడుతున్నాయి.
ఇదే స్పీడు మీద యూపీఐ చెల్లింపులు పెరిగితే రానున్న రెండు మూడు నెలల్లో వీసా, మాస్టర్ కార్డ్ రోజువారీ పేమెంట్ ట్రాన్సాక్షన్ల సంఖ్యను యూపీఐ సులువగా దాటేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ ద్వారా రోజుకు 8 వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్చి నెలలో మెుత్తంగా యూపీఐ పద్ధతిలో 25 లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దేశంలో దాదాపు 85 శాతం చెల్లింపులకు దీనినే ప్రజలు వినియోగిస్తున్నారు.
ఇదే సమయంలో చైనాకు చెందిన మెుబైల్ పేమెంట్ సిస్టమ్స్ రోజుకు 16వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ చూస్తున్నాయి. వీచాట్ పే, అలీపే వంటివి అక్కడ చాలా ఫేమస్. కానీ వీటిలో ఒకదాని నుంచి మరో బ్యాంకులకు కుదరవ్ కేవలం వాలెట్ పేమెంట్స్ మాత్రమే అనుమతించబడుతున్నాయి. ఇక బ్రెజిల్ దేశంలో యూపీఐ లాంటి వ్యవస్థ ఏడాదికి 64 బిలియన్ ట్రాన్సాక్షన్లను నిర్వహిస్తోంది. మెుత్తానికి భారతదేశంలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ గడచిన 5 ఏళ్ల కాలంలో 15 రెట్లు వ-ృద్ధిని సాధించింది. ప్రజల నుంచి ఎలాంటి అదనపు ఖర్చులు లేకపోవటం కారణంగానే దీనికి ఆమోదం లభిస్తోంది.