
వైస్బాడెన్: రెండు మ్యాచ్ల సిరీస్ కోసం జర్మనీ వెళ్లిన ఇండియా విమెన్స్ హాకీ టీమ్ బోణీ చేయలేకపోయింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో 1–4తో జర్మనీ చేతిలో ఓడింది. ఇండియా తరఫున వైష్ణవి (29వ ని.) ఏకైక గోల్ చేయగా, నికీ లోరెంజ్ (6, 59వ ని.), జెటే (14, 43వ ని.) జర్మనీకి గోల్స్ అందించారు. స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడిన జర్మనీ వచ్చిన అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది.బుధవారం ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.