
- ట్రిలియన్ డాలర్లకు చేరనున్న డిజిటల్ ఎకానమీ
బెంగళూరు: మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ కంపెనీలకు బోలెడు అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్టులు అంటున్నారు. ఇండియాలో 2020లో ఈ–కామర్స్మార్కెట్ సైజు 30 బిలియన్ డాలర్లు కాగా, 2030 చివరి ఇది 300 బిలియన్ డాలర్లకు (దాదాపు 25.70 లక్షల కోట్లకు) చేరుకుంటుందని అంచనా. ఇది దేశంలో ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీకి దోహదపడుతుందని తాజా రిపోర్ట్ ఒకటి తెలిపింది.
భారతీయ రిటైల్ మార్కెట్లో ఈ–కామర్స్ వాటా భారీగా పెరుగుతుందని బెస్సేమర్ వెంచర్ పార్టనర్స్ తన రిపోర్ట్లో పేర్కొంది. దీని ప్రకారం.. గత దశాబ్దంలో మల్టిపుల్ కన్జూమర్ మార్కెట్ప్లేస్లు, ప్లాట్ఫారమ్లు, కొత్త తరహా బ్రాండ్లు వచ్చాయి. వీటితో ఈ–కామర్స్మరింత ఎదుగుతోంది. ఇంటర్నెట్ వ్యాప్తి, అభివృద్ధి చెందుతున్న జనాభా, విధాన మార్పుల వల్ల న్యూ ఏజ్కన్జూమర్ కంపెనీల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆన్లైన్ వాణిజ్య రంగం భారీగా విస్తరిస్తోంది.
అంతేగాక, ఇటీవలి కాలంలో క్విక్-కామర్స్ పెరుగుదల ఆన్లైన్ రిటైల్ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేస్తోంది. క్విక్కామర్స్ కంపెనీలు వినియోగదారులకు నిమిషాల్లోనే వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. బిగ్బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ జెప్టో వంటి ప్లాట్ఫారమ్లు క్విక్కామర్స్ విభాగంలో దూసుకుపోతున్నాయి. ఆన్లైన్లో ప్రొడక్టులు అమ్మే డైరెక్ట్ టూ కన్జూమర్(డీ2సీ) బ్రాండ్లు కస్టమర్లకు - కొత్త, మెరుగైన ధర, అధిక నాణ్యత గల ఉత్పత్తులను అందిస్తున్నాయి. యూపీఐ ఆటోపే, ఇతర మైక్రో ట్రాన్సాక్షన్ల విలువ 2029 నాటికి 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. సేంద్రియ ఆహారం, ప్రోటీన్, ఫిట్నెస్ గాడ్జెట్లు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవల ప్రొడక్టులు ఆన్లైన్లో భారీగా అమ్ముడవుతున్నాయి.