లడఖ్: ఇండో–చైనా బార్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ను ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్లో మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మోడీ మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు.
#WATCH We are the same people who pray to the flute playing Lord Krishna but we are also the same people who idolise and follow the same Lord Krishna who carries the 'Sudarshana Chakra': PM Modi in Ladakh pic.twitter.com/lAqCjeXpqv
— ANI (@ANI) July 3, 2020
‘మీరు పని చేస్తున్న చోటు కంటే మీ తెగువ అత్యంత ఎత్తులో ఉంది. 14 కార్ప్స్ ధైర్య సాహసాల గురించి ప్రతిచోట మాట్లాడుకుంటున్నారు. దేశంలోని ప్రతి ఇంట్లో మీ పోరాట పటిమ గురించి చెప్పుకుంటున్నారు. ఎవరైతే బలహీనంగా ఉంటారో వారు శాంతిని నెలకొల్పలేరు. వీరత్వమే శాంతిని తిరిగి నెలకొల్పుతుంది. ప్రపంచం యుద్ధం కోరుకున్నా, శాంతిని కావాలనుకున్నా.. అలాంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి ప్రపంచం మన ధైర్య సాహసాలను, గెలుపును చూసింది. మానవత్వం మెరుగుదలకు మనం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నాం. మనం మురళిని ఊదే కృష్ణ భగవానుడ్ని కొలుస్తాం అదే టైమ్లో సుదర్శన చక్రంతో ఉండే కృష్ణుడినీ అనుసరిస్తాం’ అని మోడీ చెప్పారు.