లండన్: గ్లోబల్ సప్లయ్ చెయిన్స్లో కీలకంగా మారడంతోపాటు, సర్వీసెస్ ఇండస్ట్రీలో లీడర్షిప్ సాధించే సత్తా ఇండియాకు ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. డెమొక్రటిక్ వాల్యూస్ పాటించడం వల్ల ఇండియాపై ప్రపంచ దేశాలకు నమ్మకం పెరిగే ఛాన్స్ ఉంటుందని, ఈ దిశలో చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లోని సర్వీసెస్ కాంపోనెంట్తోపాటు, సర్వీసెస్లోనూ నమ్మకమైన గ్లోబల్ సప్లయర్గా అవతరించేందుకు ఇండియా ఫోకస్ పెట్టాలని అన్నారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం...దేశం దూసుకెళ్లేందుకు వీలు కల్పిస్తాయని చెప్పారు. ఐడియాస్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్లో రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.
