శంషాబాద్, వెలుగు: శంషాబాద్కు శనివారం జెడ్డా నుంచి వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్కు దారి మళ్లించి అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడ ల్యాండ్అయిన వెంటనే ప్రయాణికులను ఒక్కొక్కరిగా కిందకు దింపి తనిఖీలు చేశారు. అయితే, బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కొంతమంది ప్రయాణికులను అక్కడే దింపిన విమానం మరికొంతమందితో శంషాబాద్చేరుకుంది. ఫేక్ మెయిల్ పంపిన నిందితుడిని గుర్తించే పనిలో ఇంటలిజెన్స్ వర్గాలు నిమగ్నమయ్యాయి.
