ఒక్కసారిగా కుప్పకూలాడు..విమానం గాల్లో ఉండగానే చనిపోయాడు

ఒక్కసారిగా కుప్పకూలాడు..విమానం గాల్లో ఉండగానే చనిపోయాడు

సౌదీఅరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఆకస్మికంగా మృతిచెందాడు.విమానం గాలిలో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. మెడికల్ ఎమర్జె్న్సీ కారణంగా ఇండిగో విమానాన్ని పాకిస్తాన్ లోని కరాచీలో దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.  వైద్యులు వచ్చి పరీక్షించేలోపే ప్రయాణికుడు మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం ( నవంబర్ 23) చోటు చేసుకుంది. 

జెడ్డా నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇండిగో 6E 68 విమానంలోని ప్రయాణికుడు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే కెప్టెన్ పాకిస్తాన్ లోని కరాచీ వైపు దారి మళ్లించాడు. అక్కడికి చేరుకోగానే ప్రయాణికుడికి వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఫ్లైట్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత విమానం కరాచీ నుంచ హైదరాబాద్ కు బయలుదేరింది. 

ఇలాంటి ఘటనే 2023 ఆగస్టు లో చోటు చేసుకుంది. ముంబై నుంచి రాంచీ కి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా నాగ్ పూర్ కు దారి మళ్లించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.