ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఇండిగో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కడప నుంచి విజయవాడ, చెన్నైకి విమాన సర్వీసులు నడపనుంది ఇండిగో సంస్థ. ఈ మార్గాల్లో విమానాలు నడిపిన ట్రూజెట్ సంస్థ తాము సర్వీసులు నడపలేమని ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అధికారులు అవకాశం కల్పించారు. లేటెస్టు ఒప్పందం దృష్ట్యా వయబిలిటీ గ్యాప్ ఫండ్ (VGF)కింద ఏపీ ప్రభుత్వం ఇండిగో సంస్థకు రూ.20 కోట్లు చెల్లించనుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే కర్నూలు నుంచి విజయవాడకు మార్చి 27 నుంచి విమాన సర్వీసును నడుపుతామని గతంలోనే ఇండిగో సంస్థ ప్రకటించింది. కాగా మార్చి 27 నుంచి వారానికి నాలుగు విమానాలను ఇండిగో సంస్థ చెన్నై-కడప, విజయవాడ-కడప మార్గాల్లో నడపనుంది.
మరిన్ని వార్తల కోసం..