ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం..రాంగోపాల్ పేట డివిజన్ లో అన్నదానం

ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయం..రాంగోపాల్ పేట డివిజన్  లో అన్నదానం

 

  •     రాంగోపాల్​పేటలో ఇందిర విగ్రహావిష్కరణ

పద్మారావునగర్, వెలుగు: దేశానికి దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్​కుమార్ యాదవ్ కొనియాడారు. రాంగోపాల్​పేట డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నల్లగుట్ట అంబేడ్కర్​నగర్​లో ఏర్పాటు చేసిన ఇందిర విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. 

అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి తొలి మహిళా ప్రధానిగా మహిళలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఇందిర చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. మహేశ్ కుమార్, నాగరాజు, రఘు ముదిరాజ్, ప్రేమ్​సాగర్, విశాల్ పాల్గొన్నారు.