
తెలంగాణ ప్రభుత్వం.. పేదల కోసం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. తెల్లరి కాడే లేచి పనులకు వెళ్లే వారికి ఇందిరమ్మ క్యాంటిన్లలో కేవలం ఐదు రూపాయిలకే బ్రేక్ ఫాస్ట్ (ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్) అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకివెళ్తే..
హైదరాబాద్ లో నివసించే పేదలకు.. రోజువారీ కూలీలకు ప్రభుత్వం అద్భుతమైన స్కీంను అందుబాటులోకి రానుంది. కొత్తగా ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్ లో ఇప్పటికే రూ.5కే భోజనం అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్ల స్టాల్స్ ని జీహెచ్ఎంసీ అధికారులు కొత్తగా మారుస్తున్నారు. ప్రస్తుతం 139 చోట్ల ఈ స్టాల్స్ ఉండగా, వీటి సంఖ్యని 150 పెంచారు.
2013లో ముందుగా ఈ పథకాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత సంఖ్యని పెంచుతూ వచ్చారు. ఇలా ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన స్టాల్స్ కావడంతో చాలా వరకు డ్యామేజ్అయ్యాయి. కొన్నిచోట్ల అయితే పూర్తిగా ఖరాబై వినియోగించేందుకు వీలు లేకుండా పోయాయి. దీంతో వీటి స్థానంలో రూ.11.43 కోట్లతో బల్దియా కొత్త వాటిని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 60 చోట్ల స్టాల్స్ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న సైజుతో పోలిస్తే మూడింతలు ఎక్కువ స్పేస్తో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రోజూ 25వేల మందికి బ్రేక్ ఫాస్ట్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందిరమ్మ క్యాంటీన్లలో త్వరలో బ్రేక్ ఫాస్ట్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరులోపు సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభిస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ స్కీంలో భాగంగా ఒక్కోరోజు ఒక వెరైటీ టిఫిన్పెట్టాలని బల్దియా భావిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ పెట్టేందుకు బల్దియా మెనూ సిద్ధం చేసింది. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు ఇందులో ఉన్నాయి.
రూ.14ని భరించనున్న బల్దియా
ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్ మెంట్ తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న బల్దియా రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్ మెంట్ తో ఒప్పందం చేసుకుంది. ఒక్క బ్రేక్ ఫాస్ట్ కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ. 5 ప్రజల నుంచి తీసుకుంటుండగా, రూ.14 బల్దియా భరించనున్నది.