న్యూఢిల్లీ: అన్ని రకాల పామాయిల్ ప్రొడక్ట్ల ఎగుమతులపై ట్యాక్స్ను ఈ ఏడాది ఆగస్ట్ 31 వరకు ఇండోనేషియా ప్రభుత్వం ఎత్తేసింది. ఎగుమతులకు సపోర్ట్ చేయడానికి, ఇప్పటికే ఉన్న పామాయిల్ నిల్వలను తగ్గించుకోవడానికి ఎక్స్పోర్ట్స్పై ట్యాక్స్ను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇండోనేషియా నుంచి ఎగుమతులు పెరగనుండడంతో గ్లోబల్గా వంటనూనె ధరలు మరింత తగ్గనున్నాయి.
పామాయిల్ను ఇండోనేషియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఇండియా లాంటి దేశాలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం ఉంటుంది. లోకల్గా పెరిగిన వంట నూనె ధరలను తగ్గించడానికి ఇండేనేషియా ప్రభుత్వం ఈ ఏడాది మే 23 నుంచి మూడు వారాల పాటు పామాయిల్ ఎగుమతులపై బ్యాన్ పెట్టిన విషయం తెలిసిందే. దీంతో వీటి ఇన్వెంటరీలు పెరిగాయి.