100 రూపాయల దగ్గర గొడవ.. కత్తితో పొడిచేశాడు

100 రూపాయల దగ్గర గొడవ.. కత్తితో పొడిచేశాడు

100 రూపాయల గొడవ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. తీసుకున్న రూ.100 ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తి.. బాధితుడిపై కత్తతితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్, ఇండోర్ లోని ఎంఐజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. 

 బాధితుడు రామ్ పాల్, నింధితుడు మోహన్ యాదవ్ లు సోమ్‌నాథ్ కి నాయ్ చాల్‌ ప్రాంతంలో ఒకే గదిలో అద్దెకు ఉంటున్నారని ఎంఐజీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ లోధా తెలిపారు. రామ్ పాల్ తన వద్ద అప్పుగా తీసుకున్న  రూ.100 తిరిగా ఇవ్వాలని మోహన్ యాదవ్ ను అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. మాట మాట పెరిగి చిన్న గొడవ హింసాత్మకంగా మారింది. 

నిందితుడు మోహన్ యాదవ్ కత్తి తీసి రామ్ పాల్ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పోలీస్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వెంటనే బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. యాదవ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.