- దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ గస్తీ వెహికల్ లాంచ్
గచ్చిబౌలి, వెలుగు: దేశంలో మొట్టమొదటి యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వెహికల్ను ఇంద్రజాల్డ్రోన్డిఫెన్స్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. బుధవారం రాయదుర్గంలోని టీ హబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఇంద్రజాల్ రేంజర్’ పేరుతో ఈ వెహికల్ను లాంచ్ చేశారు.
కార్యక్రమానికి రిటైర్డ్ లెఫ్టినెంట్జనరల్ దేవేంద్ర ప్రతాజ్పాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత విషయంలో ఇది కీలక పరిణామమన్నారు. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవని, ప్రస్తుతం డ్రోన్స్పాత్ర ప్రమాదకరంగా మారిందన్నారు.
ఇటీవల పాకిస్థాన్భారత్పైకి పంపిన డోన్లను సైన్యం నిర్వీర్యం చేసిందని గుర్తుచేశారు. ఇంద్రజాల్రేంజల్వెహికల్ కదులుతూనే డ్రోన్లను గుర్తించి కూల్చివేయడం, అనుమానాస్పద డ్రోన్లను కూల్చడం చేస్తుందన్నారు. సరిహద్దుల్లో అక్రమ డ్రోన్ నెట్వర్క్లను ఎదుర్కొనే ఈ యాంటీ- డ్రోన్ వెహికల్ యంత్రం కాదని, ఇది మన పిల్లలు, రైతులు, సరిహద్దు ప్రజలకు రక్షణ కవచంగా అభివర్ణించారు.
ముంబైలోని తాజ్ హోటల్పై 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకే సరిగ్గా అదే రోజున ఈ వెహికల్ను లాంచ్ చేస్తున్నట్లు సంస్థ సీఈఓ కిరణ్రాజు తెలిపారు. ఈ యాంటీ డ్రోన్వెహికల్10 కిలోమీటర్ల పరిధి వరకు పనిచేస్తుందని, సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ దళాలపై పని భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు.
