
ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ ఈ ఏడాది ఏప్రిల్లో 2.7 శాతానికి పెరిగింది. కిందటేడాది ఏప్రిల్లో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) గ్రోత్ 5.2 శాతంగా రికార్డయ్యింది. మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, పవర్ సెక్టార్లలో బలహీన పనితీరు కారణంగా ఈ ఏడాది ఏప్రిల్లో గ్రోత్ నెమ్మదించిందని ప్రభుత్వ డేటా పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.9 శాతానికి పెరిగింది.
ఫిబ్రవరిలో ఈ నెంబర్ 2.7 శాతంగా ఉంది. ఎన్ఎస్ఓ డేటా ప్రకారం, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ ఔట్పుట్ వృద్ధి 2025 ఏప్రిల్లో 3.4 శాతానికి, మైనింగ్ ఉత్పత్తి 0.2 శాతానికి తగ్గింది. పవర్ ఔట్పుట్ వృద్ధి కూడా 2025 ఏప్రిల్లో ఒక శాతానికి స్లో అయింది.