ఘట్కేసర్, వెలుగు: ప్రేమ విఫలమైందని మనస్తాపానికి గురైన ఓ ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోచారం ఐటీ కారిడార్ సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గుంటూరు జిల్లా సంగడిగుట్టకు చెందిన కుర్ర శ్రీనివాస్రెడ్డి కొడుకు పవన్ కల్యాణ్ రెడ్డి(26) సింగపూర్ టౌన్షిప్లో ఫ్రెండ్స్తో కలిసి అద్దెకుంటూ ఇన్ఫోసిస్లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల లవ్ ఫెయిల్యూర్ కావడంతో సోమవారం రాత్రి బెబ్షీట్తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
