ఇది గీసిన బొమ్మ కాదు. చిట్టిపొట్టి చిన్నారులంతా ఓ లైన్ మీద నిలబడి ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ చిత్రం. సోమవారం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా స్టూడెంట్స్ ఇలా ముందస్తుగా గ్రీటింగ్స్ చెప్పారు. శనివారం గజ్వేల్ గర్ల్స్ ఎడ్యుకేషనల్ హబ్ లో ఈ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. 66 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 2,600 మంది స్టూడెంట్స్ , కేసీఆర్ అభిమానులు ఇందులో పాల్గొ న్నారు.
దీన్ని ఫొటోషూట్ కూడా చేశారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వంటేరు ప్రతాపరెడ్డి, భూపతిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్.రాజమౌళి, వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. – గజ్వేల్ రూరల్, వెలుగు