నారాయణ, శ్రీ చైతన్య కాలేజీలకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ రెండు కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది. చైతన్య, నారాయణ కాలేజీలు అనేక నిబంధనలను ఉల్లంఘించాయంటూ రాజేష్ అనే వ్యక్తి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు… ఈ కాలేజీలపై పూర్థి స్థాయిలో విచారణ జరపాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో పూర్తి నివేదికను తమకు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
మరిన్ని వార్తలు