సమైక్యతా వజ్రోత్సవాల్లో జాతీయ జెండాకు అవమానం..!

సమైక్యతా వజ్రోత్సవాల్లో జాతీయ జెండాకు అవమానం..!

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణలో అపశ-ృతి చోటుచేసుకుంది. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో జాతీయ జెండాను ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ ఆవిష్కరించారు. ఈ క్రమంలో జాతీయ జెండాను అనురాగ్ శర్మ తలకిందులుగా ఆవిష్కరించారు. దీంతో ఈ ఘటనపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎస్పీ సురేందర్ రెడ్డి దీనికి బాధ్యత రహితంగా వ్యవహరించిన ఆర్ఎస్ఐ సదానందంను సస్పెండ్ చేశారు. అయితే కలెక్టర్ కార్యాలయంలో  జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి జరిగిందన్న వార్తలో వాస్తవం లేదని, ముఖ్య అతిథికి అందించే దారం ఒక దానికి బదులుగా  పొరపాటున ఇంకొక దారంను  RSI సదానందం అందించడానికి ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అందుకే ఈ ఘటనకు బాధ్యుడిగా RSI ను ఎస్పీ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేసినట్టు స్పష్టం చేసింది.