ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు మే 9వ తేదీన విడుద‌లైన విషయం తెలిసిందే. ఈ ప‌రీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షలు నిర్వహించాల‌ని ఇంట‌ర్ బోర్డు నిర్ణయించింది. ఫెయిలైన విద్యార్థులు మే 16వ తేదీ వ‌ర‌కు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజు చెల్లించాల‌ని అధికారులు ఆదేశించారు. అయితే.. ఆయా కాలేజీల యాజ‌మాన్యాలు, విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల విజ్ఞప్తుల మేర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును ఈ నెల 19వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు ఇంట‌ర్ బోర్డు మంగ‌ళ‌వారం (మే 16న)  ప్రక‌టించింది. ఈ అవ‌కాశాన్ని విద్యార్థులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.