ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్  గురువారం (ఫిబ్రవరి 1) నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు మూడు విడుతల్లో ఈ పరీక్షీలు నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు, రెండో విడుత ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు, మూడో విడత ఫిబ్రవరి 11 నుంచి 16 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. 

ఫిబ్రవరి 1 నుంచి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయి. జనరల్ కోర్సు్ల్లో 3.21 లక్షల మంది, వొకేషనల్ కోర్సుల్లో 64 వేల మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ కు హాజరు కానున్నారు.