కామారెడ్డి, వెలుగు: తెలంగాణ, ఏపీలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాజేశ్చంద్ర సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ అశోక్నగర్ కాలనీకి చెందిన ఠాకూర్ జగన్సింగ్ అలియాస్దినేశ్సింగ్ అలియాస్ డీజే డానీ, అలియాస్ దినేశ్రాజ్ పురోహిత్ గత నెల 11న కామారెడ్డిలోని శ్రీసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఉండే అడ్డగుల బాలకృష్ణ ఇంట్లో 33 తులాల బంగారం, 10 కిలోల వెండి నగలు దొంగిలించాడు.
సీసీ పుటేజీ, టెక్నికల్ ఆధారాలతో నేరస్తుడిని గుర్తించిన పోలీసులు ముంబాయికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తెలంగాణ, ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 32 దొంగతనం కేసులు నమోదయ్యాయని ఎస్పీ వివరించారు. అతని నుంచి రూ.42.50 లక్షల విలువైన 14.5 తులాల బంగారం, 5.7 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మదుసూధన్, సీఐలు నరహరి, రామన్ ఉన్నారు.
