- రూ.1.60 లక్షలు పోవడంతో మనస్తాపం
- పురుగుల మందు తాగి ఆత్మహత్య
- హనుమకొండ జిల్లాలో ఘటన
శాయంపేట, వెలుగు : టెలిగ్రామ్యాప్లో ట్రేడింగ్చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించడంతో రూ.1.60 లక్షలు పెట్టి మోసపోయిన ఇంటర్స్టూడెంట్పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై ప్రమోద్కుమార్కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లికి చెందిన ఆవుల శ్రీనివాస్వ్యవసాయం చేస్తూ కొడుకు దిలీప్(17), మరో కూతురిని చదివిస్తున్నాడు.
దిలీప్ ఇంటర్ఫస్ట్ఇయర్ చదువుతుండగా, కూతురు పదో తరగతి ఎగ్జామ్స్ రాస్తోంది. దిలీప్ టెలిగ్రామ్ యాప్లో ట్రేడింగ్ చేస్తే లాభాలొస్తాయంటూ ఇచ్చిన ప్రకటన చూసి ఆశపడ్డాడు. మొదటగా రూ.5వేలు పెట్టగా అంతకు డబుల్అమౌంట్వచ్చింది. దీంతో తన పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లాడు. ఆత్యాశకు పోయి తన దగ్గరున్న డబ్బులే కాకుండా ఫ్రెండ్స్దగ్గర, తండ్రి వద్ద ఉన్న రూ.60వేలు కలిపి రూ.1.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు.
డబ్బులు తిరిగి రాకపోవడంతో పోవడంతో మోసపోయానని గ్రహించాడు. విషయం తెలిస్తే తండ్రి ఏమంటాడోనని భయపడ్డాడు. ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న డబ్బులు ఎలా ఇచ్చేదని మదనపడ్డాడు. ఈ నెల 3న పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కొద్దిసేపటికే గమనించిన తల్లిదండ్రులు దిలీప్ను వెంటనే ములుగు ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి పరకాలలో ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
