తెలంగాణలో మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్

తెలంగాణలో  మే 22 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
  • 18,837​ స్టూడెంట్స్​ కోసం 36 సెంటర్లు
  • అదనపు కలెక్టర్ కిరణ్​కుమార్​

నిజామాబాద్, వెలుగు: ఈ నెల 22 నుంచి 27 దాకా జరిగే ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్​కు  ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​​ సూచించారు. గురువారం ఆయన తన చాంబర్​లో ఇంటర్మీడియట్​ బోర్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.  మొత్తం 18,837 స్టూడెంట్స్​ సప్లిమెంటరీ పరీక్షలు రాయనుండగా 36 ఎగ్జామ్​ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఫస్ట్​ ఇయర్​ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం12 వరకు, సెకండ్​ఇయర్​ పరీక్షలు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5.30 దాకా నిర్వహిస్తామన్నారు.  ఎగ్జామ్​ టైంకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చూడాలని,  పరీక్ష సెంటర్లలో కరెంట్​ సరఫరాకు ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.

తాగునీటి వసతి కల్పించాలని, మరుగుదొడ్లు క్లీన్​గా పెట్టాలన్నారు. తగిన పోలీస్​ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆన్సర్​ షీట్స్​ భద్రంచేసే బాధ్యత పోస్టల్​ శాఖవారిదేనన్నారు. సెంటర్ల వద్ద ఫస్ట్​ ఎయిడ్​ కిట్​ అందుబాటులో పెట్టాలని, ఏఎన్​ఎం, ఆశా వర్కర్స్​ను అందుబాటులో పెట్టాలన్నారు.  డీవీఈవో రవికుమార్​, అడిషనల్​ డీసీపీ బస్వారెడ్డి, ఎగ్జామ్​ నిర్వాహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మీ తదితరులు 
ఉన్నారు.