
భీమదేవరపల్లి, వెలుగు : ముల్కనూర్ స్వకృషి మహిళా పాల డెయిరీకి అంతర్జాతీయ అవార్డు వచ్చిందని డెయిరీ జీఎం మార్పటి భాస్కర్ రెడ్డి తెలిపారు. కొచ్చిలో ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్, ఎన్డీబీబీ సంయుక్తంగా జూన్ 25 నుంచి 28 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఇందులో గ్రామీణ మహిళలతో ములుకనూరు మహిళా సహకార డెయిరీ నడవడం, దాని విధానాలు, పనితీరు, సభ్యుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తీరు నచ్చి ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. ఐడీఎఫ్జాతీయ అధ్యక్షురాలు బ్రెజిల్ల..ములుకనూరు డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీకి అవార్డు అందజేశారన్నారు.